తెలంగాణ, చత్తీస్ఘడ్ బోర్డర్ లో గత కొన్ని రోజులుగా భద్రత బలగాలు మావోయిస్టులు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆరు నెలలు కాల్పులు విరమిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటన చేశారు. ఈ ప్రకటన తెంలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు శాంతి చర్చలకి పట్టుపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కర్రెగుట్టలో భద్రత బలగాలు ఆపరేషన్ను ముమ్మరం చేసిన నేపథ్యంలో మావోయిస్టుల లేఖ ప్రధాన్యత సంతరిచుకుంది.
ఆరు నెలలు కాల్పులు విరమిస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటన
May 09, 2025
0
Tags