చైనా హునాన్ ప్రావిన్స్లోని పింగ్జియాంగ్ కౌంటీలో భారీ బంగారు గని ఉన్నట్టు హునాన్ ప్రావిన్స్ జియోలాజికల్ బ్యూరో ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్సరఫరాదారుగా ఉన్న చైనాకు మరో జాక్పాట్ తగిలినట్లైంది. భూమి లోపల రెండు కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. డ్రిల్చేసిన అనేక రాళ్లను పరిశీలిస్తే బంగారం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఒకే చోట వెయ్యి టన్నులు ఉందని చెబుతున్నారు. పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు. ఇందులో నిజం ఉండోచ్చు. ఎందుకంటే.. బంగారం మిగతా లోహాలతో కలవదు. విడిగానే ఉంటుంది. అది దాని ప్రత్యేక లక్షణం. అందువల్ల భూమిలో బంగారం దొరికితే, అది ప్యూర్ గానే ఉంటుంది. ఈ బంగారం విలువ రూ.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటివరకు అతిపెద్ద బంగారు గని రికార్డు సౌత్ఆఫ్రికాలోని ‘సౌత్ డీప్ మైన్’ పేరు మీద ఉంది. ఈ గనిలో 930 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. చైనాలో గుర్తించిన మైన్ఈ రికార్డును బద్దలుగొట్టింది. ఓ అంచనా ప్రకారం.. 3 కిలోమీటర్ల పరిధిలో ఈ బంగారం ఉందట. ఏ దేశానికైనా బంగారం అతిపెద్ద శక్తిగా పరిగణిస్తారు. ఒక దేశం ఎంత బంగారం కలిగి ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది. ఇప్పటికే చైనా- ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం సరఫరాదారు. నిజంగా ఇక్కడ అంచనాలకు అనుగుణంగా బంగారం లభిస్తే.. ప్రపంచం గోల్డ్ మార్కెట్ డ్రాగన్ కంట్రీ శాసించడం ఖాయమని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ బంగారు గని ఆ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుతుందని అందరూ భావిస్తున్నారు.
చైనాలో బయటపడ్డ భారీ బంగారు గని
May 29, 2025
0
Tags