ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పెనమలూరు మండలం చోడవరం గ్రామంలో మొక్కజొన్న మెషీన్లో శనివారం ప్రమాదవశాత్తు మహిళ పడి దుర్మరణం చెందింది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన తుమ్మల జ్యోతి (30) సహచర కూలీలతో కలిసి చోడవరం గ్రామానికి మొక్కజొన్న గింజలు ఓలిచే పనులకు వచ్చింది. పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మహిళ పడి దుర్మరణం చెందింది.
మొక్కజొన్న మెషీన్లో పడి మహిళ దుర్మరణం
April 06, 2025
0
Tags