వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో పోప్ అంత్యక్రియలు జరిగాయి. పోప్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు లక్షల మంది ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. పోప్ అంత్యక్రియల్లో ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొన్నారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ మేరకు ముర్ము నిన్న వాటికన్ సిటీకి బయల్దేరి వెళ్లారు. రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డిప్యూటీ స్పీకర్ జోషవ పీటర్ డిసౌజా కూడా వెళ్లారు. పోప్ అంతిమ యాత్రలో లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చి పోప్ కు కడసాని నివాళులర్పించారు.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు తరలి వచ్చి లక్షలాది మంది ప్రజలు
April 29, 2025
0
Tags