ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జనసేన పార్టీ తరపున కొణిదెల నాగబాబు, తెలుగుదేశం పార్టీ నుంచి బీటీ రాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. గురువారం రిటర్నింగ్ అధికారి నుంచి వీరంతా ధృవీకరణ పత్రాలు అందుకున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)