తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు ?

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వంరాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సీపీగా అంబర్‌ కిషోర్‌ ఝా, వరంగల్‌ సీపీగా సన్‌ప్రీత్‌ సింగ్‌, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా సింధూశర్మ, కామారెడ్డి ఎస్పీగా రాజేష్‌ చంద్ర, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సాయిచైతన్య, కరీంనగర్‌ సీపీగా గౌస్‌ ఆలం, ఆదిలాబాద్‌ ఎస్పీగా అఖిల్‌ మహజన్‌, నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీగా రూపేష్‌, భువనగిరి డీసీపీగా అక్షాన్ష్‌ యాదవ్‌, సంగారెడ్డి ఎస్పీగా పంకజ్‌ పరితోష్‌, సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్‌ బాబా సాహెబ్‌, వరంగల్‌ డీసీపీగా అంకిత్‌ కుమార్‌, మంచిర్యాల డీసీపీగా భాస్కర్‌, పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా శిల్పవల్లి, సూర్యాపేట ఎస్పీగా నరసింహ, సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు, సీఐడీ ఎస్పీగా పి.రవీందర్‌, SIB ఎస్పీగా వై.సాయిశేఖర్‌, అడిషనల్‌ డీజీపీ (పర్సనల్‌)గా అనిల్‌కుమార్‌, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఎస్పీగా చేతన. 

Post a Comment

0Comments

Post a Comment (0)