ఆస్తి పన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు తెలిపింది. వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం కింద రూ.465.07 కోట్లు వసూలైనట్లు పేర్కొంది.
ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు !
March 31, 2025
0
Tags