ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గురువారం తెల్లవారు జాము నుంచి గంగలూరు పరిధిలోని ఆండ్రి అడవుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకరంగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతుండగా, వివరాలు వెల్లడించేందుకు స్థానిక పోలీసులునిరాకరించినట్లు సమాచారం.
ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు ?
March 20, 2025
0
Tags