కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ముంబైలో చదరపు అడుగుకు 2 లక్షల రూపాయలకు పైగా చెల్లించి రూ.400 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ముంబైలో వర్లి సీ ఫేస్ చాలా పాపులర్ ప్రాంతం. ఉదయ్ కోటక్ ఈ ప్రాంతంలోని ఓ రెసిడెంట్ ఆస్తిని మొత్తంగా రూ.400 కోట్లకు కొనుగోలు చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత విలువైన ఆస్తి లావాదేవీ ఇదేనని నివేదికలు కూడా వెలువడ్డాయి. అతను ఇక్కడ ఉన్న రెండు అంతస్తుల అపార్ట్మెంట్లన్నింటినీ ఈ ధరకు కొన్నాడు. అంచన ప్రకారం ఉదయ్ కోటక్ చదరపు అడుగుకు రూ.2.72 లక్షల ధరకు ఈ ఆస్తిని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఉదయ్ కోటక్ కుటుంబం వర్లి సీ బేస్ ప్రాంతంలో మొత్తం 11 అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన డీడ్ రిజిస్ట్రేషన్ 30వ తేదీన జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం, ఈ మొత్తం ప్రాంతం ఉదయ్ కోటక్ కుటుంబానికి చెందినది. ఈ ప్రాంతంలో అతిపెద్ద ఇల్లు 1396 చదరపు అడుగుల గరిష్ట వైశాల్యం ఉన్న ఇల్లు అని తెలుస్తుంది. ఇది ఒక్కటే రూ.38.24 కోట్లకు అమ్ముడైంది. అదేవిధంగా, అతి చిన్న ఇల్లు 173 చదరపు అడుగులు ఇది కూడా రూ.4.7 కోట్లకు అమ్ముడవుతున్నట్లు సమాచారం. ముంబై సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ నివాసానికి సమీపంలోనే కోటక్ కుటుంబం 2018లో మరో ఇంటిని కొనుగోలు చేసింది. 2018లో ఉదయ్ కోటక్ కుటుంబం ఈ భవనాన్ని రూ.385 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రెండింటినీ కలిపి ఒక పెద్ద నివాసాన్ని నిర్మించాలని ఉదయ్ కోటక్ కుటుంబం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ఉదయ్ కోటక్ అక్టోబర్ 2024 నాటికి $14.1 బిలియన్ల నికర విలువతో ఉన్నారు. భారతదేశంలోని 100 మంది ధనవంతులలో ఆయన ఒకరు కూడా. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో ఆయన 148వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చదరపు అడుగుకు రూ.2.72 లక్షలు చెల్లిస్తున్నారు, ఇది జాతీయ రికార్డుగా పరిగణించబడుతుంది. గతంలో ముంబైలో చదరపు అడుగుకు రూ.2.25 లక్షలుగా రికార్డు నమోదైంది. అది ఇప్పుడు బ్రేక్ చేసి కొత్త రికార్డ్ నమోదైంది.
రూ.400 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేసిన ఉదయ్ కోటక్ !
February 09, 2025
0
Tags