తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎలక్షన్ బాక్సులు తీసుకువెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా ముందు వెళ్తున్న బస్సును వెనక నుంచి ఎలక్షన్ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎలక్షన్ సిబ్బంది బస్సుకు ప్రమాదం : 20 మందికి గాయాలు
February 28, 2025
0
Tags