హైదరాబాద్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్ ను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు వీవీఐపీలు పేరుతో మోసాలకు పాల్పడ్డ సయ్యద్ బురానుద్దీన్, రాహుల్ గాంధీ పీఏ నంటూ ఛత్తీస్ఘడ్ లో మోసాలు చేసారు. మైనింగ్ ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయల మేర మోసం చేసాడు. పీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఐఏఎస్ను నమ్మించాడు. ఐఏఎస్ పై అప్పటికే కొనసాగుతున్న సిబిఐ ఎంక్వయిరీ ని రద్దు చేపిస్తానంటూ కోటిన్నర రూపాయలు తీసుకొని పారిపోయాడు. హైదరాబాదులో ఓ బిజినెస్మెన్ కు ఈడి అధికారులు నోటీసులో జారీ చేసిన విషయం తెలిసి ఆ వ్యాపారిని కూడా మోసం చేసాడు ఈ ఘనుడు. నకిలీ ఈడీ కార్యాలయాన్నే సృష్టించిన కేటుగాడు.. అదే కార్యాలయానికి వ్యాపారిని పిలిపించి కోట్ల రూపాయలు వసూలు చేసాడు. అయితే మొయినాబాద్ లో రెండేళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో కేసు నమోదు కాగా ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బురానుద్దీన్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు.
హైదరాబాద్లో మోస్ట్వాంటెడ్ క్రిమినల్ అరెస్టు !
January 21, 2025
0
Tags