మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు దుర్మరణం

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని జల్గావ్‌లో బుధవారం సాయంత్రం లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురై కదులుతున్న రైలు నుంచి దూకారు. ఆ సమయంలోనే పక్కన ఉన్న ట్రాక్‌పై కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వస్తోంది. రైలు నుంచి దూకిన ప్రయాణికులను కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢి కొట్టింది.  జల్గావ్‌లోని పచోరా తహసీల్‌లోని పర్ధాడే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 7 నుంచి 8 మంది మృతి చెందినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ముంబై సిఎస్‌టి వైపు వెళ్తుంది. రైలు పచోరా రైల్వే స్టేషన్‌లో పార్క్ చేసి వుంది.. ఆ సమయంలో రైలులోని బి4 బోగీలో మంటలు చెలరేగాయని.. ఆ తర్వాత రైలులో మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. ఒక సీనియర్ రైల్వే అధికారి పిటిఐతో మాట్లాడుతూ.. 'హాట్ యాక్సిల్' లేదా 'బ్రేక్-బైండింగ్' (జామింగ్) పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లోపల స్పార్క్‌కు కారణమైంది.. ఇది కొంతమంది ప్రయాణికులను భయానికి గురిచేసింది. చైన్ లాగి కొందరు పట్టాలపై నుంచి కిందకు దూకారు. అదే సమయంలో పక్కనే ఉన్న ట్రాక్‌పై నుంచి మరో రైలు వెళ్తోందని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)