తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఈ పరీక్షలు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు. వార్షిక పరీక్షలు మాత్రం మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.