మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుకు సహకరించింది ఎవరు ?

Telugu Lo Computer
0


మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ఏడు రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్‌ను విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం సేకరించారు. బంజారాహిల్స్‌ పీఎస్‌లో విచారణ చేస్తోన్న పోలీసులు మీడియా కంటపడకుండా ఠాణా గేట్లు మూసివేశారు. ఎస్‌ఐబీలో అతనితో పాటు పనిచేసిన ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ స్థాయి అధికారులను విచారించి, వాంగ్మూలం నమోదు చేశారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రణీత్‌ను ప్రశ్నిస్తున్నారు. డిసెంబరు 4న ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఎవరెవరు సహకరించారని ప్రణీత్‌రావును ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు ఆధారాలు, ఐఎంఈఐ నంబర్లు, సీడీఆర్‌, ఐపీ అడ్రస్‌ల డేటాను సేకరించారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ధ్వంసం చేసి కొత్తవి ఎందుకు అమర్చాల్సి వచ్చిందని ప్రశ్నించగా ప్రణీత్‌ మౌనంగా ఉన్నట్టు సమాచారం. మరో వైపు వికారాబాద్‌ అడవుల్లో పడేసిన హార్డ్‌ డిస్క్‌లను సేకరించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రణీత్‌ను స్వయంగా తీసుకెళ్లి పడేసిన ప్రాంతంలో పోలీసులు గాలించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)