ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రత్యేక టూర్ సేల్ ను ప్రారంభించింది. దానికి క్రిస్మస్ కమ్స్ ఎర్లీ అనే పేరు పెట్టింది. ఈ సేల్లో జాతీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లపై మంచి తగ్గింపును అందిస్తోంది. కంపెనీ షేర్ చేసిన అధికారిక వివరాల ప్రకారం, ఆసక్తిగల ప్రయాణికులు విమానాల ప్రయణ చార్జీల్లో 30 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. లేదా అంత మొత్తంలో వివిద ప్రయోజనాలను పొందొచ్చు. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్లో మాత్రమే కాక ఏదైనా థర్డ్-పార్టీ పోర్టల్ నుంచి కూడా ఈ క్రిస్మస్ కమ్స్ ఎర్లీ సేల్ ప్రయోజనాలు పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 2, 2023 నుంచి మే 30, 2024 వరకు చేసే ప్రయాణాలకు సంబంధించిన టికెట్ చార్జీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఆయా తేదీల్లో ప్రయాణానికి సంబంధించి ఈ నవంబర్లోనే టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో చేసిన బుకింగ్ లకు మాత్రమే ఈ ప్రత్యేక తగ్గింపు వర్తిస్తుంది. ఇదే విషయాన్ని ఎయిర్ ఎండియా తన అధికారిక వెబ్ సైట్లో ధ్రువీకరించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్రిస్మస్ సేల్ ను కేవలం టికెట్ చార్జీలపై తగ్గింపు మాత్రమే కాక, అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. టికెట్ కోసం లాగిన్ అయిన సభ్యునికి క్యారియర్ కొన్ని అదనపు ట్రీట్లు, కాంప్లిమెంటరీ ఎక్స్ప్రెస్ ఎహెడ్ సర్వీసెస్, అవార్డ్-విన్నింగ్ అప్లికేషన్లపై జీరో కన్వీనియన్స్ ఫీజులను అందిస్తోంది. ప్రత్యేక సభ్యుల కోసం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విక్రయ ప్రయోజనాలు టాటా నియోపాస్ రివార్డ్స్ ప్రోగ్రామ్ సభ్యులు నియో కాయిన్స్ 8 శాతం వరకు సంపాదించవచ్చు. ఇది వారి విమాన ప్రయాణానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అదనంగా, ప్రత్యేకమైన సభ్యులు భోజనం, సామాను, సీట్లు, విమాన మార్పు, రద్దు రుసుము మినహాయింపుల ప్రయోజనాలను ఆనందించవచ్చు. విమానయాన సంస్థ సేల్ ఆఫర్లో కొన్ని మార్గాలను జాబితా చేసింది. ఈ జాబితాలో బెంగుళూరు-కన్నూరు, బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-తిరువనంతపురం, బెంగళూరు-మంగళూరు, కన్నూర్-తిరువనంతపురం, చెన్నై-తిరువనంతపురం, బెంగళూరు-తిరుచిరాపల్లి, నెట్వర్క్లో తగ్గింపు ధరలతో పాటుగా ఉన్నాయి.
ప్రయాణ చార్జీలపై ఎయిర్ ఇండియా డిస్కౌంట్లు !
November 27, 2023
0
Tags