అతి వేగం మూడు ప్రాణాలను బలి తీసుకుంది !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం బైపాస్‌ సెంటర్‌ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.  నిర్లక్ష్యం మూడు ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే బైక్‌పై నలుగురు యువకులు అతివేగంతో వెళ్లి ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నాలుగో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లంతా రత్తవారిపేట చెందిన పెయింటర్లుగా పోలీసులు గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)