ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో బీజేపీ తీర్మానం లేఖను విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ''మాది జాతీయ పార్టీ. మేం ఓట్ల రాజకీయాలు చేయడం లేదు. అందరితో చర్చించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటే తెలియజేస్తాం. దీని ఆధారంగా (కులగణన) ఎన్నికలను నడపడం సరికాదు. కులగణను బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నిర్ణయం చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. తగిన సమయంలో మేము మీకు తెలియజేస్తాము'' అని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీహార్లో నిర్వహించిన కులాల సర్వే మాదిరిగానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా ఈ దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. దేశంలో కుల గణనను కోరుతున్నామని అన్న ఆయన.. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కోసం పనిచేయడం లేదని విమర్శించారు. ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘెల్, రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులాల సర్వే నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. మధ్యప్రదేశ్లోని చంద్లాలో శుక్రవారం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, "మమ్మల్ని కులవాదులు అంటారు. సోషలిస్టులు ఎప్పటికీ కులవాదులు కాలేరు. సమాజ్వాదీ ప్రజలు అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి పని చేస్తారు. మేము అధికారంలోకి వచ్చినప్పుడు లేదా మా మద్దతుతో ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము చేసే మొదటి పని కులాల లెక్కింపు అని మా పార్టీ నమ్ముతుంది'' అని అన్నారు.
కులగణనపై బీజేపీ యూటర్న్?
November 03, 2023
0
Tags