కేంద్రం ఏజెంట్‌గా తమిళనాడు గవర్నర్‌ !

Telugu Lo Computer
0


మిళనాడు రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కేంద్రప్రభుత్వ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఎండీఎంకే అధినేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టీఎన్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ శైలేంద్రబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు పంపిన ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్‌ తిరస్కరించడమంటే అది ప్రజామోదాన్ని తిరస్కరించడంలాంటిదన్నారు. ఆయన ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి కాదని వైగో ధ్వజమెత్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)