ఆవు దాడిలో వృద్ధుడు మృతి !

Telugu Lo Computer
0


పంజాబ్ లోని మొహాలీలోని పన్‌లో సరూప్ సింగ్‌ అనే వృద్దుడిపై దాడి చేసింది. 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో కన్నుమూశాడు. సీసీటీవీలో రికార్డైన విజువల్స్ షాక్‌కి గురిచేసాయి. పగబట్టినట్లు 83 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది. 100 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. తనను రక్షించుకోవడానికి ఆ పెద్దాయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. రోడ్డుపై వాహనాలు వెళ్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో వృద్ధుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఆవు అతనిని ఈడ్చుకెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నెటిజన్లు షాకయ్యారు.


Post a Comment

0Comments

Post a Comment (0)