చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత క్రీడాకారుడు అనూష్ అగర్వాలా చరిత్ర సృష్టించాడు. టీఎల్ ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్ వ్యక్తిగత విభాగంలో దేశానికి తొలి పతకం అందించాడు. 24 ఏళ్ల అనూష్ అగర్వాలా, అతడి గుర్రం ఎట్రోతో పాటు రికార్డులకెక్కాడు. కోల్కతాకు చెందిన అనూష్ తన అశ్వానికి అన్ని రకాలుగా తర్ఫీదునిచ్చాడు. ఈ క్రమంలో డ్రెసాజ్ ఈవెంట్ ఫైనల్లో అనూష్ సూచనల (మ్యూజిక్)కు తగినట్లుగా ఎట్రో పర్ఫెక్ట్ సింక్లో ప్రదర్శన ఇచ్చింది. దీంతో ఇంప్రెస్ అయిన న్యాయనిర్ణేతలు అనూష్, ఎట్రోల మధ్య సమన్వయం చక్కగా ఉండటంతో పతకం ఖరారు చేశారు. ఈ క్రమంలో 73.030 స్కోరు చేసిన అనూష్ అగర్వాలాకు కాంస్యం లభించింది. కాగా డ్రెసాజ్ ఫైనల్లో బ్లాక్బస్టర్ జయహో పాటను కూడా ప్లే చేయడం గమనార్హం. ఇక ఈ ఈవెంట్లో మలేషియాకు చెందిన బిన్ మహ్మద్ స్వర్ణం గెలవగా.. హాంకాంగ్ ప్లేయర్ జాక్వెలిన్ వింగ్ యింగ్ రజతం సాధించింది. కాగా 19వ ఆసియా క్రీడల్లో ఇప్పటికే ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్ ఈవెంట్లో భారత్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
ఆసియా క్రీడలలో చరిత్ర సృష్టించిన అనూష్
September 28, 2023
0