మొత్తం 239 కి.మీ పొడవైన ఈ మార్గం రూ.3,238 కోట్లతో నిర్మించేందుకు కెబినెట్ ఆమోదం. హైదరాబాద్-చెన్నై మధ్య 76 కి.మీ మేర తగ్గనున్న దూరం, హైదరాబాద్-విజయవాడ మధ్య కూడా తగ్గనుంది. ఈ మూడెు నగరాల మధ్య పెరగనున్న ప్రయాణికుల రైళ్ల వేగం, గూడ్సు రవాణాకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ముద్కేఢ్ – మేడ్చల్ మార్గం డబ్లింగ్, మహబూబ్నగర్ – డోన్ మధ్య కూడా డబ్లింగ్, దీంతో హైదరాబాద్ – బెంగళూరు మధ్య 50 కి.మీ మేర తగ్గనున్న దూరం, కొత్త మార్గం పూర్తయితే వందే భారత్ వంటి రైళ్లకు ఉపయోగకరం.
ఆంధ్రప్రదేశ్లో విజయనగరం నుంచి ఖుర్దా రోడ్ మీదుగా నెర్గుండి వరకు 3వ రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం. కటక్ (నెర్గుండి) నుంచి విశాఖపట్నం (విజయనగరం) మధ్య 3 లైన్ల ద్వారా పెరగనున్న రైల్వే సామర్థ్యం. సోన్ నగర్ నుంచి అండాల్ మధ్య (ఢిల్లీ-కోల్కత్తా మార్గం) 4 వరుసల రైల్వే ప్రాజెక్ట్. ఇప్పటికే ఉన్న రెండు లైన్లకు అదనంగా మరో రెండు లైన్ల నిర్మాణం. తూర్పు, ఈశాన్య భారతదేశంలోని జనాభాకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం. ఉత్తరప్రదేశ్ లో వివిధ రూట్లలో 190.844 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు. మహారాష్ట్రలో వివిధ రూట్లలో 49.15కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు. ఒడిశాలో 184 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు. బీహార్లో 139.246 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు. ఝార్ఖండ్లో 201.608 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు. పశ్చిమ బెంగాల్లో 40.35 కి.మీ మేర నిర్మితం కానున్న నూతన రైల్వే లైన్లు ఉన్నాయి.