దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలో ఒడిశా రైలు ప్రమాదం తరహాలో ప్రమాదం జరుగుతుందని హెచ్చరిస్తూ లేఖ రాశాడు. ''త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుంది. వారం రోజుల్లో ఒడిశా తరహా యాక్సిడెంట్. హైదరాబాద్‌ - ఢిల్లీ మార్గంలోనే ఇది జరుగుతుంది'' అని లేఖలో బెదిరించాడు. అతని వివరాలేవీ ఉత్తరంలో లేవని తెలుస్తోంది. అధికారులు ఈ ఉత్తరంపై ఆరా తీస్తున్నారు. మూడు రోజుల కిందట రైల్వే అధికారులు తమకు ఈ లేఖ గురించి చెప్పారని పోలీసులు తెలిపారు. ఇక ఆకతాయి రాసిన లేఖ కావొచ్చని భావిస్తున్నారు. ఒడిశాలోని బలాసోర్‌లో గత నెల 2న ఒక గూడ్సు రైలు, రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో 294 మంది చనిపోవడం తెలిసిందే. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)