టైటానిక్ శిథిలాలను చూడడానికి తీసుకెళ్లే జలాంతర్గామి గల్లంతు !

Telugu Lo Computer
0


అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలను చూడటానికి ప్రజలను తీసుకెళ్లడానికి ఉపయోగించే చిన్న జలాంతర్గామి దాని సిబ్బందితో సహా అదృశ్యమైనట్లు బీబీసీ తెలిపింది. సముద్రంలో సబ్‌మెర్‌సిబుల్‌ ఎక్కడ తప్పిపోయిందనే విషయంపై కూడా స్పష్టత లేదు. సబ్‌మెర్సిబుల్ ఒకేసారి ఐదుగురు వ్యక్తులను మోసుకెళ్లగలదు. టైటానిక్ శిథిలాల వరకు పూర్తి డైవ్ చేయడానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది. సబ్‌మెర్సిబుల్‌ను గుర్తించేందుకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. సబ్‌మెర్సిబుల్ ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్‌కు చెందినది. ఇది లోతైన సముద్ర యాత్రల కోసం మనుషులతో కూడిన సబ్‌మెర్సిబుల్‌లను పంపించే సంస్థగా పేరు పొందింది. సిబ్బందిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి "అన్ని మార్గాలు" అన్వేషిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే గల్లంతైన వారి సంఖ్యను కచ్చితంగా నిర్ధారించలేదు. నాలుగు రోజుల ఆక్సిజన్ సరఫరాతో డైవ్ చేసే సబ్‌మెర్సిబుల్ సాధారణంగా ఒక పైలట్, ముగ్గురు పేయింగ్ గెస్ట్‌లను తీసుకువెళుతుంది. టైటానిక్ 1912లో తన తొలి ప్రయాణంలో మంచుకొండను ఢీకొట్టి అట్లాంటిక్‌ సముద్రంలో మునిగిపోయింది. టైటానిక్ మునిగిపోవడంతో 1,500 మందికి పైగా మరణించారు. ఓడ శిథిలాలు 1985లో అట్లాంటిక్ మహాసముద్రం దిగువన గుర్తించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో శిథిలాల సందర్శనల వీడియో చివరిసారిగా విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)