కారు ప్రమాదంలో ఎన్నారై మృతి

Telugu Lo Computer
0


అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కారు ప్రమాదంలో ఒక ఎన్నారై మృతి చెందాడు. మరణించిన వ్యక్తి 30 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మిలన్ హితేష్‌ భాయ్ పటేల్  అని అధికారులు గుర్తించారు. మిలన్ హితేష్‌భాయ్ పటేల్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల తర్వాత స్టేట్ రూట్ 61లో ఉత్తరాన ప్రయాణిస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మిలన్ కారు రోడ్డుకు కుడివైపు నుండి ఒక గుంటను ఢీకొట్టిందని ఓహియో స్టేట్ హైవే పెట్రోల్ నార్వాక్ పోస్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఓహియో స్టేట్ హైవే పెట్రోల్ నార్వాక్ పోస్ట్ ప్రకటన ప్రకారం, అతని వాహనం రోడ్డుకు కుడి వైపు నుంచి పక్కకు వెళ్లి ఒక గుంటను ఢీకొట్టింది. మిలన్ కారులో ఒంటరిగా ఉన్నాడని.. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో కారులోనే ఇరుక్కుపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని వాహనం నుంచి బయటకు తీయడానికి ఎమర్జెన్సీ రెస్పాండర్‌లు మెకానికల్ పరికరాన్ని ఉపయోగించారు. చివరకు మిలన్ ను కారు నుంచి బయటకు తీశారు. చివరికి తీవ్ర గాయాలతో మరణించాడని ఫాక్స్ 8 న్యూస్ నివేదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)