మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. కేశబ్ మహీంద్రా 1963 నుండి 2012 వరకు మహీంద్రా గ్రూప్ కు ఛైర్మన్గా పనిచేశారు. మహీంద్రా మరణాన్ని సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు. భారతదేశంలోని అత్యంత వృద్ధ బిలియనీర్ మహీంద్రా ఆగస్టు 9, 2012న మహీంద్రా గ్రూప్ ఛైర్మన్గా పదవీ విరమణ చేసిన చేశారు. అనంతరం ఆ బాధ్యతలను ఆనంద్ మహీంద్రాకు పగ్గాలు అప్పగించారు. కేశబ్ మహీంద్రా వ్యాపారవేత్తగా మహీంద్రా సెయిల్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ మరియు ఐసిఐసిఐతో సహా అనేక కంపెనీల బోర్డులలో పనిచేశారు. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో భారతదేశంలోని 16 మంది కొత్త బిలియనీర్లలో అతను చేర్చబడ్డారు. 48 ఏళ్ల పాటు మహీంద్రా గ్రూప్కు నాయకత్వం వహించిన ఆయన 2012లో చైర్మన్ పదవిని వదులుకున్నారు. 48 సంవత్సరాలలో ఛైర్మన్గా మహీంద్రా గ్రూప్ ఆటోమొబైల్ తయారీదారు నుండి IT, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ వంటి ఇతర వ్యాపార విభాగాలకు విస్తరించారు. ఇంటర్నేషనల్ హార్వెస్టర్, యునైటెడ్ టెక్నాలజీస్, బ్రిటీష్ టెలికాం మరియు అనేక ఇతర ప్రపంచ మేజర్లతో వ్యాపార సంబంధాలను ఏర్పరచడంలో అతను కీలక పాత్ర పోషించాడు. కాగా, మహీంద్రా USAలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ నుండి పట్టభద్రుడయ్యాడు. 1947లో కంపెనీలో చేరి 1963లో చైర్మన్ అయ్యారు.కేశబ్ మహీంద్రా 1923 అక్టోబర్ 9న సిమ్లాలో జన్మించారు. ఆయన మృతి పట్ల కార్పొరేట్ ప్రపంచం మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.
కేశబ్ మహీంద్రా కన్నుమూత
April 12, 2023
0
Tags