దేశంలోని 550 కంటే ఎక్కువ నగరాల్లో హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ రెడ్.హెల్త్, మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాట్ఫారమ్ ఎయిర్ అంబులెన్స్ సేవను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రారంభించిన ఎయిర్ అంబులెన్స్ సేవలు వైద్య సాంకేతికతతో అమర్చబడి ఉన్నాయని, ఎయిర్ అంబులెన్స్ లో క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ ప్రొఫెషనల్స్ సిబ్బంది ఉంటారని తెలిపింది. దేశంలోని ఏదైనా భూభాగం లేదా భౌగోళికం ప్రాంతం నుంచి రోగులను సమర్ధవంతంగా తీసుకెళ్లే ఎనిమిది ప్రత్యేక విమానాలు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. రెడ్ ఎయిర్ గార్డియన్ మెడికల్ ఎమర్జెన్సీల కోసం ఎయిర్ ట్రాన్స్ఫర్ కాకుండా ఎయిర్పోర్ట్కు బయటికి ఉపరితల రవాణాను కూడా అందిస్తుంది. దేశమంతటా ఉన్న విమానాశ్రయాలలో 25 కంటే ఎక్కువ విమానాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో 10కి పైగా విమానాలు పార్క్ చేయడానికి అనుమతి ఉన్నట్లు చెప్పింది. సంస్థ రాయ్పూర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎంసీఆర్ వంటి నగరాల నుంచి ఎయిర్ అంబులెన్స్ సేవులు చురుకుగా అందిస్తోంది. దుబాయ్, అబుదాబి, మస్కట్, దోహా వంటి మధ్యప్రాచ్య దేశాలలోని ఈ కంపెనీ తన సేవలను అందజేస్తోంది. మేము కేవలం 15 నిమిషాల్లో రోగిని చేరుకోవడంలో గర్వపడుతున్నాము. ఒక అడుగు ముందుకు వేస్తూ, ప్రత్యేకమైన లేదా దృఢమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేని దేశంలోని ప్రాంతాల్లో మరింత ఎక్కువ మంది ప్రాణాలను కాపాడేందుకు మేము ఇప్పుడు సన్నద్ధమయ్యాము" అని రెడ్.హెల్త్ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రభదీప్ సింగ్ తెలిపారు. "మా ఎయిర్ అంబులెన్స్ సేవ అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక వైద్య సదుపాయానికి ఎక్కువ దూరం బదిలీ చేయాల్సిన రోగులకు సహాయం చేస్తుంది" అని సింగ్ తెలిపారు.
550 నగరాల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు !
April 27, 2023
0
Tags