రాజ్యసభ కొత్త చైర్మన్​గా జగ్​దీప్​ ధన్​కర్​ బాధ్యతలు స్వీకరణ

Telugu Lo Computer
0


ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్​కర్​ రాజ్యసభ కొత్త చైర్మన్​గా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్​ శీతాకాల సమావేశల తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర నేతలు ధన్​కర్​ను చైర్మన్​ సీటు వరకు తీసుకుని వెళ్లారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సందర్భంగా ధన్​కర్​కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను ధన్​కర్​ కొనసాగిస్తారని అధికార పార్టీ సభ్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న పార్టీలకు మరింత సమయం ఇవ్వాలని, ప్రభుత్వ బిల్లుల స్క్రూటినీ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను బలోపేతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి. లోక్​సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇటీవల మరణించిన సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్, 8 మంది మాజీ సభ్యులకు లోక్​సభ నివాళులర్పించింది. ద మల్టీ స్టేట్​ కో ఆపరేటివ్ సొసైటీస్ (అమెండ్​మెంట్) బిల్లు, 2022ను ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది.


Post a Comment

0Comments

Post a Comment (0)