తిరుమలలో వేంకటేశ్వరుడిని అత్యంత దగ్గరగా దర్శించుకోవాలనే ప్రతి భక్తుడి కోరికను నెరవేరుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీవారి గర్భగుడి బంగారు వాకిలి నుంచి దివ్య రూపాన్ని కళ్లారా వీక్షించే అరుదైన దర్శన భాగ్యాన్ని 'లక్కీ డిప్' విధానం ద్వారా అందిస్తోంది. సాధారణ దర్శనం ఏడవ ద్వారం నుంచి జరుగుతుండగా, ఈ ప్రత్యేక అవకాశం ద్వారా స్వామివారిని చాలా అతి చేరువ (సుమారు 10 అడుగుల దూరం) నుంచి దర్శించుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీవారి దర్శనానికే పరిమితం కాదు. అత్యంత వైభవంగా నిర్వహించే సుప్రభాతం, తోమాల వంటి అరుదైన ఆర్జిత సేవలను కూడా దగ్గర నుంచి చూసి తరించడానికి భక్తులకు అవకాశం దక్కుతుంది. ఈ సేవల్లో పాల్గొనడం వల్ల భక్తులకు ఒక మరపురాని ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది. అయితే, భక్తుల రద్దీని, టిక్కెట్ల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, ఈ అద్భుతమైన అవకాశం అందరికీ సమానంగా దక్కేలా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ విధానాన్ని టీటీడీ అమలు చేస్తోంది. ఈ లక్కీ డిప్ ద్వారా ఎంపికైన అదృష్టవంతులకు మాత్రమే ఈ సేవల్లో పాల్గొనే భాగ్యం లభిస్తుంది. శ్రీవారి సేవల్లో పాలుపంచుకోవాలనుకునే భక్తులు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ ఆర్జిత సేవల టికెట్ల కోసం ప్రతి నెలా 18వ తేదీన టీటీడీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్ణీత గడువులోగా నమోదు చేసుకున్నవారి వివరాలను ఒకేసారి పరిగణనలోకి తీసుకుని, పారదర్శకమైన పద్ధతిలో కంప్యూటర్ ద్వారా లక్కీ డిప్ నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన భక్తులకు మొబైల్ సందేశం ద్వారా సమాచారం అందుతుంది. భక్తులు ఈ దివ్యమైన దర్శన భాగ్యాన్ని పొందేందుకు అధికారిక టీటీడీ వెబ్సైట్ను మాత్రమే సందర్శించాలని, ఎలాంటి అనధికారిక వెబ్సైట్లను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ లక్కీ డిప్ పద్ధతి తిరుమలలోని అత్యంత ముఖ్యమైన, డిమాండ్ ఉన్న ఆర్జిత సేవలకు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి) వర్తిస్తుంది. కాబట్టి, ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, శ్రీవారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని టీటీడీ భక్తులకు సూచింస్తుంది.
బంగారు వాకిలి నుంచి దివ్య రూపాన్ని వీక్షించేందుకు 'లక్కీ డిప్' విధానాన్ని ప్రవేశ పెట్టిన టీటీడీ !
October 11, 2025
0
Tags