ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సక్సెస్పుల్గా ముగిసింది. నాలుగు ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఉత్తర కొరియా ఈ సమావేశంలో పాల్గొంది. ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి కిమ్ సన్ గ్యో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ అణ్వాయుధాలను వదిలివేయాలని డిమాండ్ చేయడం తమ దేశ గుర్తింపు, రాజ్యాంగాన్ని తొలగించడంతో సమానమని పేర్కొన్నారు. నిరాయుధీకరణకు ఏవైనా షరతులు ఉంటే అది లొంగిపోవడమే అవుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ పదేపదే ఉత్తర కొరియా అణ్వాయుధీకరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా ప్రకటన అమెరికాపై ప్రత్యక్ష దాడి అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిమ్ జోంగ్ ఉన్ తన అణ్వాయుధ ఆయుధశాల ఇకపై ఎప్పటికీ బేరసారాల చిప్గా ఉండదని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, అణ్వాయుధ నిరాయుధీకరణ, ఆంక్షల ఎత్తివేతపై మాత్రం ఇరుదేశాల ఒప్పందం విఫలమైంది. ఉత్తర కొరియా తన ప్రసంగంలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను పెరుగుతున్న దురాక్రమణ ముప్పుగా విమర్శించింది. అందుకే కొరియా ద్వీపకల్పంలో అధికార సమతుల్యతను కొనసాగించడానికి అణ్వాయుధాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
అణ్వాయుధాలను వదులుకునే ప్రసక్తే లేదు : ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి కిమ్ సన్ గ్యో
September 30, 2025
0
Tags