పవన్‌ కల్యాణ్‌ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు

Telugu Lo Computer
0


గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను, సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. పవన్‌ కల్యాణ్‌ వైరల్‌ జ్వరంతో బాధపడుతున్నట్లు ఐదు రోజుల క్రితం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించినప్పటికీ మంగళవారం శాఖాపరమైన అంశాలపై అధికారులతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించినట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)