తెలంగాణలోని హనుమకొండ, రామ్నగర్లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ఇవ్వొద్దని మధ్యాహ్న భోజన పథకం కార్మికులు మంత్రి ఇంటిని ముట్టడించారు. 8 నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకొని పోలీసు స్టేషన్కు తరలించారు.
మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా
August 11, 2025
0
Tags