దక్షిణ కొరియాలో 2026 మార్చి నుండి పాఠశాలల్లో తరగతుల సమయంలో పిల్లలు మొబైల్ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలను ఉపయోగించలేరు. పిల్లలు, టీనేజర్లలో స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న వ్యసనాన్ని ఆపడానికి ఒక కొత్త చట్టానికి ప్రభుత్వం ఆమోదించింది. ఈ చట్టం తర్వాత, కఠినమైన చట్టం ద్వారా మొబైల్లను నిషేధించిన దేశాలలో దక్షిణ కొరియా చేరింది. అయితే, వికలాంగులైన విద్యార్థుల చదువుల కోసం డిజిటల్ పరికరాలను ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఈ చట్టం మార్చి 2026 నుండి అమల్లోకి వస్తుంది. పాఠశాలలు, విద్యాశాఖ అధికారులు దీనికి సిద్ధం కావడానికి అవసరమైన ప్రోటోకాల్లను రూపొందించడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. స్మార్ట్ఫోన్ల వాడకం విద్యార్థుల చదువులపై చెడు ప్రభావాన్ని చూపుతోందని, వారి సమయాన్ని వృధా చేస్తుందని చట్టసభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అయితే, కొంతమంది విద్యార్థులు ఈ నిర్ణయంతో ఏకీభవించడం లేదు. ఇది ఎలా అమలు అవుతుంది. దాని పరిణామాలు ఏమిటి? ఇది నిజంగా మొబైల్ వ్యసనానికి మూలకారణాన్ని తొలగించగలదా అనే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. సర్వే ప్రకారం, దక్షిణ కొరియా ప్రపంచంలోనే అత్యంత డిజిటల్గా అనుసంధానించిన దేశాలలో ఒకటి. అమెరికాలోని ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, 2022-23 సంవత్సరంలో 27 దేశాలపై నిర్వహించిన సర్వేలో, దక్షిణ కొరియాలో 99% మంది ఆన్లైన్లో ఉన్నారు. 98% మంది స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారు. ఈ సంఖ్య అన్ని ఇతర దేశాల కంటే అత్యధికం. దక్షిణ కొరియాతో పాటు, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, చైనా వంటి దేశాలలోని పాఠశాలల్లో ఫోన్లను నిషేధించారు ప్రభుత్వ డేటా ప్రకారం, దక్షిణ కొరియాలోని 51 మిలియన్ల మందిలో దాదాపు పావు వంతు మంది తమ ఫోన్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ సంఖ్య టీనేజర్లలో 43%కి పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా సైబర్ బెదిరింపులకు భయపడుతున్నారు. బిల్లును ప్రవేశపెట్టిన ప్రతిపక్ష ఎంపీ చో జంగ్-హున్ మాట్లాడుతూ, స్మార్ట్ఫోన్లను అధికంగా ఉపయోగించడం వల్ల మెదడు అభివృద్ధి, భావోద్వేగ పెరుగుదలకు హాని కలుగుతుందని శాస్త్రీయ, వైద్యపరమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు.
దక్షిణ కొరియాలో పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై నిషేధం !
August 27, 2025
0
Tags