విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దానికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. మెట్రో ప్రాజెక్టు, పర్యవేక్షణ, సాంకేతిక సహకారంపై కన్సల్టెన్సీలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి నారాయణ సమక్షంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిస్టా, టిప్సా కన్సల్టెన్సీల ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. విశాఖ, విజయవాడ మెట్రో మొదటి దశ పనుల్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖ మెట్రో ఫేజ్ 1లో భాగంగా 46.23 కి.మీ పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఫేజ్ 2లో మరో 30 కి.మీ ఉంటుందన్నారు. విజయవాడ మెట్రోకు రెండు రోజుల్లో టెండర్లు పిలుస్తామని తెలిపారు.
విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు రెండు కన్సల్టెన్సీలతో ఒప్పందం
July 25, 2025
0
Tags