ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యన్ సైనికులకు కొత్త భయం పట్టుకుంది. ఇటీవల ఫ్రంట్ లైన్లో ఉన్న నలుగురు రష్యా సైనికులు వారి తోటి సిబ్బంది కళ్లముందే కుప్పకూలి మృత్యువాతపడ్డారు. వారి చనిపోవడానికి కారణం విషం కలిసిన నీళ్లు అని అంటున్నారు. ఆ నలుగురు సైనికులు తాగిన నీటిలో విషం కలిసిందని, అదే వారి ప్రాణాలు తీసిందని చెబుతున్నారు. అలానే మరి కొందరి సిబ్బంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత దొనెట్స్క్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే రష్యా సైనికులు తాగిన ఈ అవర్ వాటర్ నీళ్ల బాటిల్స్ మానవతా సాయం కింద ఈ ప్రాంతానికి వచ్చాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.ఈ వాటర్ బాటిల్స్ని క్రిమియాలోని సిమఫెరోపోల్ నుంచి పంపించినట్లు గుర్తించారు. అయితే ఈ బాటిళ్లను ఎవరు పంపారు? అవి ఫ్రంట్లైన్ సైనికులు చేతికి ఎలా వచ్చాయి? నిజంగానే ఆ వాటర్ బాటిల్స్లో విషం కలిపారా? అదే వాస్తవం అయితే ఎవరూ అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. అయితే వాటర్ బాటిల్స్లో విషం కలిపి రష్యా సైనికులకు పంపిణీ చేసిన కుట్రలో ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా సైన్యం, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటుగా సరకుల రవాణాకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతోనే ఉక్రెయిన్ ఇలాంటి నీచపు పనులకు పాల్పడిందని రష్యన్ మిలిటరీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. రష్యా సైనికుల డ్రగ్స్ తీసుకుని అవి వికటించే మృతి చెందారని ఈ విషయాన్ని దాచిపెట్టేందుకే మాస్కో ఈ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడింది.
విషం కలిసిన నీరు తాగడంతో కుప్ప కూలిన రష్యా సైనికులు ?
July 19, 2025
0
Tags