హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేడు చేప ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. బత్తిని కుటుంబ సభ్యులు గత 178 సంవత్సరాలుగా చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నారు. మంత్రికి సైతం చేప మందు అందించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు ఇక్కడికి తరలి వస్తున్నారు. 13 కౌంటర్ల ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేస్తుండగా.. దాదాపు 42 క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. కాగా 2 రోజుల పాటు బత్తిని కుటుంబం పంపిణీ చేయనుంది. జీహెచ్ఎంసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ పలు శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 70 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తూ.. 1000 మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. వీఐపీల కోసం 4 గేట్లు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం 3 గేట్లు ఏర్పాటు చేశారు. అజంతా గేట్ నుంచి సామాన్యులకు ప్రవేశం కల్పించనున్నారు. అంతే కాకుండా ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ల నుంచి చేపమందు పంపిణీ వద్దకు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ చేప ప్రసాదం తీసుకునే వారు బత్తిని కుటుంబం సూచించిన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. నాలుగు సంవత్సరాల పాటు వరుసగా ఈ ప్రసాదం తీసుకోవాలి. శాఖాహారుల కోసం, చేపలకు బదులుగా బెల్లం తో తయారు చేసిన ప్రత్యేక ప్రసాదం అందుబాటులో ఉంటుంది.
చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్
June 08, 2025
0
Tags