తమిళనాడులోని కేంద్ర ఆఫీసుల్లో హిందీని తొలగించండి !

Telugu Lo Computer
0


మిళనాడులోని కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో హిందీని తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో సెంగోల్ ప్రతిష్ఠించడం వంటి సింబాలిక్ స్టెప్స్ పక్కన పెట్టి తమిళానికి మద్దతుగా అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని బీజేపీకి సూచించారు. మృత భాష సంస్కృతానికి కాకుండా తమిళానికి ఎక్కువ నిధులు కేటాయించాలని, హిందీతో సమానంగా అధికార భాషా హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మాటలు కాకుండా చేతల్లో చూపాలని సవాల్ విసిరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)