భారత్‌లో ఎక్స్ ప్రీమియమ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా పెంపు !

Telugu Lo Computer
0


భారత్‌లో ఎక్స్ ప్రీమియమ్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచేసింది. ఈ పెంపుతో గతంలో ఉన్న ధరలకు ఈ ధరలు రెట్టింపు కావడం గమనార్హం. మరోవైపు.. ఇప్పటికే ఒకసారి ఎక్స్ ప్రీమియమ్ ప్లస్ ఛార్జీలను పెంచగా.. 3 నెలల వ్యవధిలోనే ఇప్పుడు రెండోసారి పెంచడంతో ఎక్స్ యూజర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గ్రోక్‌ 3 ఏఐ మోడల్‌ విడుదల తర్వాత ఈ ధరల పెంపు జరిగింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియర్ ఇంటెలిజన్స్‌కు సంబంధించి స్టార్టప్ సంస్థ "ఎక్స్‌ఏఐ" తాజాగా గ్రోక్‌ 3 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ ఎక్స్ఏఐని ఉపయోగించాలంటే ఎక్స్‌లో ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుందని దాన్ని ప్రవేశపెట్టి సమయంలోనే ఎక్స్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీమియమ్ ప్లస్ ప్లాన్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు భారత్‌లో ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు రూ.1750గా ఉండగా.. తాజా పెంపుతో అది రూ.3,470కి చేరింది. ఇక ఏడాది మొత్తానికి తీసుకునే ప్లాన్‌ ధరను రూ.18300 నుంచి రూ.34340కి పెంచింది. అంటే ఈ ప్లాన్ ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. అయితే ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ఆ తర్వాత అందులో ఎన్నో సంచలనాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్విటర్‌ను కొనుగోలు చేసిన వెంటనే దాని పేరును ఎలాన్ మస్క్ ఎక్స్‌గా మార్చేశారు. ఆ తర్వాత ఎక్స్ నుంచి ఆదాయన్ని సమకూర్చుకునేందుకు 2023 అక్టోబర్‌లోనే మొట్టమొదటిసారి ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్స్ ప్రవేశపెట్టింది. అయితే మొదట ఈ ప్రీమియమ్ ప్లస్ ప్లాన్ ప్లాన్‌ ధర తక్కువగానే నిర్ణయించారు. 2023 అక్టోబర్‌లో రూ.1,300గా ఉన్న ఎక్స్ ప్రీమియం ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర.. ఆ తర్వాత 2024 డిసెంబర్‌లో రూ.1,750కి పెంచేశారు. ఈ క్రమంలోనే 3 నెలలు తిరగకుండానే.. తాజాగా ఈ ప్లాన్ ధరను భారీగా పెంచేశారు. రూ.1750 నుంచి ఒక్కసారిగా ఏకంగా రూ.3,470కు పెంచడంతో యూజర్లపై ఆర్థిక భారం పడనుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)