అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) కన్నుమూశారు. వయోభారంతో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడిలో 1924 డిసెంబర్ 24న కృష్ణవేణి జన్మించారు. 'సతీ అనసూయ' సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. 1940లో మీర్జాపురం రాజా (మేకా రంగయ్య)తో ఆమె వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నిర్మాతగానూ మారారు. 'మనదేశం' సినిమాతో ఎన్టీఆర్ ను చిత్రరంగానికి పరిచయం చేశారు.
నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత
February 16, 2025
0
Tags