ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో పని చేసిన మహిళా ఉద్యోగిని పదవీ విరమణ చేసింది. దీంతో ఆమెకు వీడ్కోలు పలికేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దగా డ్రమ్స్ వాయించగా డాక్టర్లు, వైద్య సిబ్బంది డ్యాన్సు చేశారు. రోగులను పట్టించుకోకుండా డప్పుల శబ్దం మధ్య చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. కాగా, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. డప్పు శబ్దాలను భరించలేక వేదన అనుభవించారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బంది తీరుపై పలువురు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో రోగులను పట్టించుకోకుండా డాక్టర్లు, సిబ్బంది డ్యాన్సులు చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. మరోసారి ఇలా జరుగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో చిందులు వేసిన డాక్టర్లు, సిబ్బంది !
May 01, 2024
0
Tags