ఇనుప రాడ్లు దొంగిలించాడనే అనుమానంతో కర్రతో దాడి !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని షాహరాన్‌పూర్‌లో ఇనుప రాడ్లు దొంగలించాడన్న అనుమానంతో ఓ యువకుడిని స్థంబానికి కట్టేసి కొంత మంది దాడి చేశారు. అందులో ఓ వ్యక్తి అమానవీయంగా కర్రతో విచక్షణ రహితంగా యువకుడిని చితకబాదాడు. విషయం తెలుసుకున్న సాదర్‌ బజార్‌ పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకుడిపై దాడి చేసిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని.. పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. బాధిత యువకుడిని స్థానికంగా ఉండే అమిత్‌ శర్మగా పోలీసులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)