ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధాaర్ కేవైసీ రిజిస్ట్రేషన్ సమయంలో ఓపెన్ అవకపోవటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు జనాలు గంటల తరబడి వేచి చూశారు. ఉదయం నుంచి వెయిట్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి వినియోగదారులు వెళ్లిపోయారు. ఇవాళ రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇదే సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వర్లో సాంకేతిక లోపం తలెత్తిందని.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు !
December 01, 2023
0
Tags