చెక్‌ ప్రధాని రాజీనామా చేయాలని భారీ ర్యాలీ !

Telugu Lo Computer
0


చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని ప్రాగ్‌లో అధిక ధరలకు నిరసనగా ఆందోళనకారులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి పీటర్‌ ఫియాలా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి మద్దతుగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని నిరసనకారులు తప్పుపట్టారు. కొత్త పార్టీ పీఆర్‌వో ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. నాటో నుంచి చెక్‌ దూరం కావాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అమెరికాతో అధికార కూటమి సన్నిహిత సంబంధాలు కొనసాగించడాన్నీ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)