రాఖీ పండుగ నాడు కవిత ఎమోషనల్ ట్వీట్ !

Telugu Lo Computer
0


రాఖీ పండుగ సందర్భంగా సందడిగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఈసారి ఖాళీ అయిపోయింది. తన సోదరుడు కేటీఆర్ తన కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నందున కవిత రాఖీ కట్టలేకపోయింది. కవిత ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. రక్షా బంధన్ సందర్భంగా అన్నయ్య కేటీఆర్‌తో తనకున్న బంధాన్ని తెలియజేస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. 'అమ్మలో మొదటి అక్షరం.. నాన్నలో చివరి అక్షరం నా అన్న' అంటూ అన్నతో కలిసి ఉన్న చిత్రంతో పాటు కవిత ట్వీట్ చేశారు. ఎమోషనల్ ట్వీట్ ద్వారా తనకున్న ప్రేమను తెలియజేసింది ఎమ్మెల్సీ కవిత. సొంత అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయినా మరో సోదరుడు సంతోష్ కు కవిత రాఖీ కట్టింది. అలాగే సొంత సోదరి జోగినిపల్లి సౌమ్య కూడా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కి రాఖీ కట్టారు. తనకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లతో కలిసి నవ్వుతున్న ఫొటోను జత చేస్తూ సంతోష్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఈ రాఖీ ప్రేమకు ప్రతిరూపం మాత్రమే కాదని, తోబుట్టువులను సోదరులు ఎల్లప్పుడూ కాపాడాలని గుర్తుచేస్తున్నారని సంతోష్ అన్నారు. తన ప్రియతమ సోదరి కవిత, సౌమ్య రాఖీ కట్టడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. తన ప్రపంచాన్ని మరింత అందంగా, వెలుగులోకి తెచ్చిన తన చెల్లెళ్లకు ధన్యవాదాలు అంటూ సంతోష్ ట్వీట్ చేశాడు. రాఖీ పండుగ సందర్భంగా కవిత తన తోబుట్టువులు మరియు కుటుంబంలోని పిల్లలందరూ కలిసి ఉన్న మరో చిత్రాన్ని కూడా ట్వీట్ చేశారు. ఇలాంటి గొప్ప సోదరులు ఉండటం తన అదృష్టమని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)