ఆంధ్రప్రదేశ్లో కేబినేట్ సమావేశం ముగిసింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అమలుకు.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే జనవనరుల శాఖలో పలు నిర్ణయాలకు కూడా గ్రీన్ ఇచ్చేశారు. అసైన్డ్ భూములపై అనుభవదారులకి సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 సంవత్సరాలకు ముందు కేటాయించిన భూములకు సైతం హక్కులు కల్పించేలా నిర్ణయించారు. https://t.me/offerbazaramzon
ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి కేబినేట్ ఆమోదం
July 12, 2023
0
Tags