ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆస్పత్రి పాలయ్యారు. ఆమె స్వల్ప అస్వస్థతకు గురి కాగా కాలు నొప్పి, వాపుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాలు నొప్పి, అస్వస్థత కారణంగా చెన్నైలోని థౌజండ్ లైట్స్ లో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి చెన్నైలో తన ఇంట్లో కుటుంబ సభ్యులతో రోజా గడిపారు. ఈ క్రమంలోనే రోజాకు ఒక్కసారిగా కాలువాపు, నొప్పి రావడంతో ఆమెను అర్థరాత్రి కుటుంబసభ్యులు అపోలో హాస్పిట్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందని, కాలువాపు కూడా తగ్గిందని డాక్టర్లు చెబుతున్నారు. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
మంత్రి రోజాకు స్వల్ప అస్వస్థత
June 11, 2023
0