బీహార్లోని ఛప్రాకు చెందిన ఓ అమ్మాయి ఫేస్బుక్లో అబ్బాయిలా నటిస్తూ హర్యానాలోని గురుగ్రామ్ కు చెందిన బాలికను మోసగించింది. తర్వాత ఇద్దరూ పారిపోయి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కలుసుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకోవడంతో ఆ తర్వాత ఇద్దరూ ముంబై వెళ్లి ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్కు చెందిన అమ్మాయికి అసలు విషయం తెలిసి పెద్ద షాక్ తగిలింది. పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలూ మైనర్లే. ఛప్రాలోని ఎక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బాలిక తండ్రి తన కుమార్తె అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఛప్రాకు చెందిన ఓ బాలిక యువకుని పేరుతో ఫేస్బుక్ ప్రొఫైల్ను నడుపుతోంది. ఇక్కడ ఆమె గురుగ్రామ్కి చెందిన ఒక అమ్మాయితో చాటింగ్ ప్రారంభించింది. దాదాపు మూడు నెలల పాటు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. ఫేస్బుక్లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీని తరువాత ఛప్రాకు చెందిన బాలిక జూన్ 2 న ఇంటి నుండి పారిపోయింది. గురుగ్రామ్లోని ఓ యువతి కూడా తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ అమ్మాయిలిద్దరూ కాన్పూర్లో కలుసుకున్నారు.. అక్కడ నుండి ముంబైకి వెళ్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత ఛప్రాకు చెందిన అమ్మాయి కూడా ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో 15 రోజులు పనిచేసింది. అయితే హనీమూన్ సమయంలో తాను పెళ్లి చేసుకున్నది అబ్బాయి కాదని, అమ్మాయిని అని గ్రహించింది. దీని తర్వాత ఇద్దరూ జూన్ 14న ఛప్రా చేరుకున్నారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ బంధువులకు అప్పగించారు.
ఫేస్ బుక్ లో అమ్మాయిని అబ్బాయిగా నమ్మి మోసపోయిన యువతి !
June 19, 2023
0
Tags