నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ను ఎయిర్ అంబులెన్స్లో న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తరలించారు. పాడెల్ (78) మంగళవారం కడుపునొప్పితో త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్ లో చేరారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకిందని ప్రాథమిక విచారణలో తేలింది. దీనితో మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ కు తరలించారు. బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో రాష్ట్రపతిని ఎయిర్ అంబులెన్స్లో భారత్కు తరలించినట్లు రాష్ట్రపతి పత్రికా సలహాదారు కిరణ్ పోఖారెల్ తెలిపారు.ఆయన వెంట ఆయన కుమారుడు చింతన్ పాడెల్ తదితరులు ఉన్నారు.మంగళవారం, ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్, మరియు ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి పూర్ణ బహదూర్ ఖడ్కా, ఇతర నాయకులు ఆయనను సందర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
నేపాల్ అధ్యక్షుడిని ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
April 19, 2023
0
Tags