పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నేవీ అధికారి చందక గోవింద్ (31) మృతి చెందారు. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా, పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో ప్రమాదం జరిగింది. పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ఆయన మృతి పట్ల నేవీ చీఫ్ ఆర్ హరి కుమార్ ప్రగాఢ సంతాపం తెలిపారు. డిఫెన్స్ ప్రతినిధి ప్రకారం గోవింద్ విశాఖపట్నంలోని నేవీ మెరైన్ కమాండోస్ (మార్కోస్) కోసం ప్రత్యేక స్థావరం ఐఎన్ఎస్ కర్ణకు పంపారు. గోవింద్ పారాచూట్ తెరవలేదని, దాని కారణంగా అతను బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలోని బార్జోరాలోని ఒక ఫ్యాక్టరీ సమీపంలో పడిపోయాడని చెప్పారు. పోలీసులు అతన్ని బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.
పారాచూట్ తెరుచుకోకపోవడంతో నేవీ ఉద్యోగి మృతి
April 06, 2023
0
Tags