విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగే రెండో వన్డేకు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీగా బాధ్యతల్ని తిరిగి స్వీకరించనున్నారు. తొలి వన్డేకు రోహిత్ స్థానంలో హార్ధిక్ పాండ్యా చేపట్టిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దా సోదరుడు కునాల్ సజ్దా పెళ్లి కారణంగా రోహిత్ తొలి వన్డేకు దూరమయ్యారు. తొలి వన్డేలో కేఎల్ రాహుల్ 75 రన్స్తో నాటౌట్గా నిలిచిన జట్టుకు విజయాన్ని అందించారు. దాదాపు 8 నెలల తర్వాత వన్డే మ్యాచ్ ఆడిన రవీంద్ర జడేజా.. రెండు వికెట్లు తీసి, కీలకమైన 45 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. రోహిత్ కెప్టెన్సీలో రెండో వన్డేలో నెగ్గి సిరీస్ లో ఆధిక్యాన్ని సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
విశాఖ వన్డేకు కెప్టెన్గా రోహిత్ శర్మ
March 18, 2023
0
Tags