ఈక్వెడార్ జైలులో మళ్లీ హింసాకాండ

Telugu Lo Computer
0

ఈక్వెడార్ నగరమైన లాటాకుంగాలోని జైలులో మళ్లీ హింసాకాండ చెలరేగింది. జైలులో జరిగిన హింసాకాండలో 15మంది ఖైదీలు మరణించారు. జైలులో జరిగిన ఘర్షణల్లో మరో 21 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. జైలులో ఉన్న డ్రగ్స్ గ్యాంగుల మధ్య చెలరేగిన ఘర్షణలో 15 మంది మరణించడం సంచలనం రేపింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది ఈక్వెడార్ జైలులో జరిగిన హింసాకాండలో 316 మంది మరణించారు. జులై 13వతేదీన సంతా డోమింగో జైలులో జరిగిన అల్లర్లలో 43 మంది మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)